తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్బా చేరుకున్న దేశంలోనే అతి పొడవైన రైలు - దైశంలో అతి పొడవైన రైలు

దేశంలోనే అతిపొడవైన కార్గో రైలు వాసుకిని ప్రారంభించి.. దక్షణ- తూర్పు రైల్వే రికార్డు సృష్టించింది. ఛత్తీస్​గఢ్​లోని బిలాయీ నుంచి కోర్బా వరకు 224 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7గంటల్లోనే పూర్తిచేసింది ఆ రైలు.

indias-longest-train-vasuki-reaches-korba
దేశంలోనే అతి పొడవైన రైలు వాసుకి

By

Published : Jan 23, 2021, 4:50 PM IST

దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు వాసుకిని విజయవంతంగా ప్రారంభించి దక్షిణ-తూర్పు రైల్వే రికార్డు సృష్టించింది. ఐదు కార్గో రైళ్లను జతచేసి 3.5 కిలోమీటర్ల వాసుకి రైలును ఏర్పాటు చేశారు.

దేశంలోనే అతి పొడవైన రైలు వాసుకి

జనవరి 22న ఛత్తీస్​గఢ్​లోని​ భిలాయి నుంచి రాయ్​పూర్​ రైల్వే డివిజన్​లోని కోర్బావరకు నడిపి ఈ ఘనత సాధించింది దక్షిణ- తూర్పు రైల్వే. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 224కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లోనే వాసుకి పూర్తి చేసింది. కాగా భిలాయీ నుంచి కోర్బా కు బొగ్గు రవాణా చేయాడానికి వాసుకిని వాడనున్నారు.

కోర్బా చేరుకున్న దేశంలోనే అతి పొడవైన రైలు వాసుకి

దీన్ని నడపడానికి ఒక లోకో పైలెట్​, అసిస్టెంట్​ పైలెట్​ ఉంటే సరిపోతుంది. ఇంకా ఒక భద్రతా సిబ్బంది చాలు. అదే మామూలు రైలుకైతే ఐదుగురు లోకో పైలెట్​లు, ఐదుగురు అసిస్టెంట్​ పైలెట్లు, ఐదుగురు భద్రతా సిబ్బంది అవసరం. దేశంలో వాసుకి తర్వాత శేష్​నాగ్​ రైలు పొడవైనది.

ఇదీ చూడండి:'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'

ABOUT THE AUTHOR

...view details