తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రోన్ల ముప్పుపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు - mm naravane

జమ్ముకశ్మీర్​లో ఇటీవల వరుసగా డ్రోన్లు వెలుగుచూస్తున్న వేళ.. ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల ద్వారా కలిగే ముప్పు గురించి తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు.

naravane
నరవణె

By

Published : Jul 1, 2021, 3:12 PM IST

డ్రోన్లు సులభంగా దొరుకుతుండటం వల్ల భద్రతా సవాళ్లు మరింత పెరిగినట్లైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. డ్రోన్ల ద్వారా కలిగే ముప్పు గురించి భద్రతా దళాలకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు.

"ఇతర దేశాల మద్దతుతో జరిగే దాడులతో పాటు, స్వయంగా ఆయా దేశాల వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు మా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. డ్రోన్ల నుంచి ప్రత్యక్ష, పరోక్ష ముప్పును ఎదుర్కొనేలా సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాం."

-జనరల్ నరవణె, ఆర్మీ చీఫ్

ఈ సందర్భంగా నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై మాట్లాడారు జనరల్ నరవణె. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని భారత్-పాక్ సైన్యాలు నిర్ణయించుకున్న తర్వాత.. ఎల్​ఓసీ వెంట చొరబాట్లు లేవని చెప్పారు. ఫలితంగా కశ్మీర్​లో ఉగ్రవాదులు, ఉగ్ర సంబంధిత ఘటనల సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. జమ్ము కశ్మీర్​లో చొరబాటు వ్యతిరేక వ్యవస్థలు పటిష్ఠంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇటీవల జమ్ము విమానాశ్రయంలో రెండు డ్రోన్లతో దాడి జరిగింది. అనంతరం.. అనేక డ్రోన్లు కశ్మీర్​లో కనిపించడం కలకలం రేపాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details