తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​-నేపాల్​ బంధం ప్రభుత్వాలకే పరిమితం కాదు'

నేపాల్​ విదేశాంగ మంత్రితో రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న బంధం ప్రభుత్వానికి పరిమితం కాదని వ్యాఖ్యానించారు.

By

Published : Jan 16, 2021, 5:11 PM IST

indian army, rajnath
'ఇరు దేశాల బంధం ప్రభుత్వాలకే పరిమితం కాదు'

భారత్- నేపాల్ బంధం ఇరు దేశాల ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలీతో శనివారం జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంపై రాజ్​నాథ్ ట్వీట్ చేశారు.

"నేపాల్ విదేశాంగ మంత్రితో ఈ రోజు సమావేశం జరిగింది. భారత్​, నేపాల్ బంధం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాదు. ఇరు దేశాల ప్రజలకు కూడా బంధం ఉంది. భారత్ నేపాల్ మధ్య సంబంధాలు అపరిమిత శక్తిని అందిస్తాయి."

-రాజ్​నాథ్​ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి

మూడు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్​ గ్యవాలీ శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జయశంకర్​తో భేటీ అయ్యారు. నేపాల్​తో ఇటీవల ఏర్పడ్డ సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

సైనికులపై రాజ్​నాథ్​ ప్రశంసలు..

భేటీ అనంతరం ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలోని సైనిక ఆస్పత్రి భూమి పూజలో పాల్గొన్న రాజనాథ్​.. సైనికులను ప్రశంసించారు. చైనాతో సరిహద్దు వివాద సమయంలో భారత సైనికులు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు. ప్రజలను తలెత్తుకునేలా చేశారని, వారిలో ఎలాంటి ప్రమాదం లేదనే నమ్మకాన్ని పెంచారని అన్నారు. ఈ ఆస్పత్రి ప్రారంభమైతే పదవి విరమణ చేసిన సైనికులకు మేలు కలుగుతుందని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :కొవిడ్​ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం

ABOUT THE AUTHOR

...view details