తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అఫ్గాన్ ప్రజల పక్షానే భారత్: జైశంకర్ - భారత్ అఫ్గాన్ విదేశాంగ మంత్రుల సమావేశం

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్​లో సంభాషించారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్రపై చర్చించినట్లు తెలిపారు. భారత్.. అఫ్గాన్ ప్రజల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు.

jai shankar
జైశంకర్

By

Published : Apr 17, 2021, 7:50 PM IST

భారత్ ఎప్పుడూ అఫ్గాన్ ప్రజల పక్షాన నిలబడుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి హనిఫ్ ఆత్మర్​తో ఫోన్​లో మాట్లాడిన ఆయన.. అఫ్గాన్ నుంచి దళాల పూర్తి ఉపసంహరణపై అమెరికా ప్రకటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర చర్చకు వచ్చినట్లు జైశంకర్ తెలిపారు.

"ప్రస్తుత పరిణామాలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రితో మంచి సంభాషణ జరిగింది. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర గురించి చర్చించాం. ఎప్పటిలాగే, అఫ్గానిస్థాన్ ప్రజల పక్షాన భారత్ నిలబడుతూనే ఉంటుంది."

-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

అఫ్గాన్​లో శాంతి స్థాపనకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. అఫ్గాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లను వెచ్చించింది. తాలిబన్లతో చర్చలు అఫ్గాన్ ఆధ్వర్యంలోనే జరగాలని ఆశిస్తోంది.

ఇదీ చూడండి:ఆక్సిజన్, రెమ్​డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు!

ABOUT THE AUTHOR

...view details