తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలాంటి ఒత్తిడికీ భారత్​ తలొగ్గదు: బిపిన్ రావత్ - చైనాపై రావత్ విమర్శలు

చైనా తీసుకొచ్చే ఒత్తిళ్లకు భారత్​ తలొగ్గదని చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. సాంకేతికంగా బలంగా ఉందన్న ధైర్యంతో చైనా ఈ ప్రలోభాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. రైసీనా డైలాగ్​ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

CDS, Bipin Rawat
రావత్, త్రిదళాధిపతి

By

Published : Apr 16, 2021, 4:47 AM IST

ఎలాంటి ఒత్తిళ్లకు భారత్​ తలొగ్గదని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర సరిహద్దుల్లో యథాతథస్థితిని నెలకొల్పేందుకు భారత్​ ధృడంగా సంకల్పించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. లద్దాఖ్​ ప్రాంతంలో చైనాతో తలెత్తిన వివాదాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు రావత్. దిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్​ సమావేశంలో పాల్గొన్న ఆయన చైనా తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

"సాంకేతికంగా, సైన్యం పరంగా ధృడంగా ఉందన్న నమ్మకంతో చైనా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ, భారత్​ దీన్ని దీటుగా ఎదుర్కొంది. సాంకేతికత సాయంతో.. సైన్యాన్ని ఉపయోగించకుండా భారత్​ సరిహద్దుల్లో యథాతథస్థితిని నిరోధించే ప్రయత్నం చేసింది చైనా. భారత్​ ఇందుకు తలొగ్గలేదు. ప్రపంచదేశాలు భారత్​కు మద్దతుగా నిలిచాయి."

--బిపిన్​ రావత్, త్రిదళాధిపతి.

ఆర్మీ దళాల ఆధునికీకరణపై మాట్లాడిన రావత్.. అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పొందేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, అమెరికా తమ సాంకేతికతను పంచుకోవడానికి సాయం చేస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జపాన్ సాయుధ దళాల జాయింట్ స్టాఫ్​ జెన్ కోజి యమజకి కూడా చైనాపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి:'అడ్డంకులు తొలగించి టీకా ఉత్పత్తి పెంచాలి'

ABOUT THE AUTHOR

...view details