తెలంగాణ

telangana

చైనాకు చెక్​ పెట్టేలా..  భారత్​, అమెరికా యుద్ధ విన్యాసాలు!

By

Published : Jun 23, 2021, 7:33 PM IST

హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న యుద్ధవిన్యాసాలను.. భారత్​, అమెరికాలు బుధవారం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలకు చెందిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే హిందూ మహా సముద్రంలో మోహరించాయి. ఈ ప్రాంతంలో చైనా ఆగడాలకు చెక్​పెట్టేందుకు ఈ విన్యాసాలను చేపట్టినట్లు తెలుస్తోంది.

wargame in Indian Ocean
భారత్​, అమెరికా యుద్ధ విన్యాసాలు

హిందూ మహాసముద్రంలో.. భారత్​, అమెరికా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను బుధవారం ప్రారంభించాయి. రెండు రోజులపాటు ఈ విన్యాసాలు ప్రదర్శించనున్నాయి ఇరు దేశాలు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు చెక్​ పెట్టే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అమెరికా తమ నావికాదళమైన యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​కు చెందిన​ యుద్ధనౌకలు, ఎఫ్​-18, ఈ-2సీ యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం మోహరించింది.

భారత్​ తమ జాగ్వార్​, సుఖోయ్-30ఎం​కేఐ యుద్ధ విమానం, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్​-78 యుద్ధవిమానం, ఏడబ్ల్యూఏసీసీ యద్ధవిమానాలను, ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను మోహరించింది. ​వీటితో పాటు.. పీ8ఐ సముద్రతీర నిఘా వ్యవస్థను, మిగ్​29కే యుద్ధవిమానాలను కూడా భారత్​ ఈ విన్యాసాల కోసం సిద్ధం చేసింది.

విన్యాసాల్లో యుద్ధనౌక
యూఎస్​ఎస్​ రోనాల్డ్​ రీగన్​
విన్యాసాల్లో యుద్ధనౌక
విన్యాసాల్లో పాల్గొనున్న యుద్ధనౌక
విన్యాసాలకు సిద్ధంగా ఉన్న భారత యుద్ధ విమానాలు

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ రెండురోజుల విన్యాసాలను చేపడుతున్నట్లు భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్​ వివేక్​ మాద్వాల్​ తెలిపారు. కేరళ తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి

ఇదీ చూడండి:'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'

ABOUT THE AUTHOR

...view details