దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారిని భారత్ తిరిగి రప్పించాలన్న కృత నిశ్చయంతోనే ఉన్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మెహుల్ ఛోక్సీని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది.
"ప్రస్తుతం అతడు(ఛోక్సీ) డోమినికా కస్టడీలో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అతడిని భారత్కు తీసుకొచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తాం."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి
గాజా హింసపై ఐరాస మానవ హక్కుల మండలిలో ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటాన్ని నిరసిస్తూ పాలస్తీనా విదేశాంగ మంత్రి లేఖ రాయడంపై బాగ్చికి ప్రశ్నలు సంధించారు పాత్రికేయులు. అయితే ఈ అంశంపై భారత్ వైఖరి కొత్తేం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా భారత్ ఇలాగే వ్యవహరించిందని చెప్పారు. ఓటింగ్కు దూరంగా ఉన్న అన్ని దేశాలకూ పాలస్తీనా లేఖలు రాసిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి-పాక్ వైఖరిపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు