తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2021, 6:59 AM IST

ETV Bharat / bharat

ప్రపంచానికి భారత్​ టీకా.. లెక్క ఎంతంటే?

ఇప్పటివరకు విదేశాలకు 2.29 కోట్ల కరోనా టీకా డోసులను భారత్​ పంపిణీ చేసింది. త్వరలో దశలవారీగా మరిన్ని దేశాలకూ వ్యాక్సిన్లను అందించనుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

india vaccine help
విదేశాలకు భారత్​ 229 లక్షల టీకా డోసుల సాయం

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్​ పంపిణీ చేయడంలో భారత్​ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాలకు 2.29 కోట్ల కరోనా టీకా డోసులను​ పంపిణీ చేసింది. వాటిలో 64 లక్షల డోసులను ఉచితంగా అందించగా.. 1.65 కోట్ల డోసులను వాణిజ్య రూపంలో అందించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

దశల వారీగా వివిధ దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు. రాబోయే వారాల్లో ఆఫ్రికా దేశాలు, లాటిన్​ అమెరికా, కరీబియన్​ కమ్యూనిటీకి టీకా సరఫరా చేయనున్నామని చెప్పారు. వ్యాక్సిన్​ అవసరాలకు అనుగుణంగానే ఈ టీకాలను పంపిణీ చేస్తామని శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

మయన్మార్​పై అంగీకారం..

సైనిక తిరుగుబాటుతో అల్లాడుతున్న మయన్మార్​ పరిస్థితులపై చర్చించడానికి భారత్​-అమెరికాలు అంగీకరించాయని అనురాగ్​ శ్రీ వాస్తవ తెలిపారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణలో చర్చించారని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిపాలన జరగాలని భారత్​ విశ్వవిస్తున్నట్టు అన్నారు. అక్కడి పరిస్థితులను భారత్​ నిశితంగా గమనిస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి:రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్​

ABOUT THE AUTHOR

...view details