తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుతిన్ పర్యటనలో భారత్​ ఏకే 203 రైఫిళ్ల ఒప్పందం!

పుతిన్ పర్యటనలో భారత్​కు రష్యా 7.5 లక్షల ఏకే 203 రైఫిళ్లను సరఫరా చేసే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతంకానుంది.

By

Published : Dec 2, 2021, 6:25 AM IST

AK-203 deal
AK-203 deal

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 7.5 లక్షల ఏకే 203 రైఫిళ్ల సరఫరా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో భారత్-రష్యా సైనిక సంబంధాలు బలోపేతమవడం సహా దేశ రక్షణ రంగానికి మరింత జవసత్వాలు చేకూరనున్నాయి.

ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులూ లభించాయి. కాగా, డిసెంబర్ 6న పుతిన్ భారత్ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ-పుతిన్ భేటీలో భాగంగా ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్​ వ్యవస్థను కూడా భారత్​కు అందించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:డిసెంబర్​ 6న భారత్​కు పుతిన్.. మోదీతో కీలక చర్చలు

ABOUT THE AUTHOR

...view details