తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 9,110 మందికి వైరస్

By

Published : Feb 9, 2021, 9:57 AM IST

దేశంలో కొత్తగా 9,110 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 8లక్షల 47వేలు దాటింది. వైరస్​ సోకిన వారిలో మరో 14,016 మంది కోలుకున్నారు.

corona cases in india
దేశంలో కొత్తగా 9 వేల మందికి వైరస్

దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,110 మంది వైరస్​ బారినపడ్డారు. మహమ్మారి సోకిన వారిలో మరో 78 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 1,08,47,304
  • యాక్టివ్ కేసులు:1,43,625
  • కోలుకున్నవారు:1,05,48,521
  • మొత్తం మరణాలు:1,55,158

కొవిడ్​ బారినపడిన వారిలో మరో 14,016 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా..సోమవారంఒక్కరోజే 6 లక్షల 87 వేల 138 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 20.25 కోట్లు దాటింది.

దేశీయంగా.. ఇప్పటివరకు సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.

ఇదీ చదవండి:'రైతులను ప్రధాని మోసగించారు'

ABOUT THE AUTHOR

...view details