తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​లో చిన్నారులపై ​వేధింపులు.. మూడేళ్లలో 25 లక్షల కేసులు! - ఆన్​లైన్​లో చిన్నారులపై ​వేధింపులు

దేశవ్యాప్తంగా ఆన్​లైన్​లో చిన్నారులపై ​వేధింపులు ఎక్కువైనట్లు ఓ అంతర్జాతీయ నివేదిక స్పష్టంచేసింది. గడచిన మూడేళ్లలో 24లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు తేలింది. బాధితుల్లో దాదాపు 80శాతం మంది 14ఏళ్లలోపు చిన్నారులేనని స్పష్టమైంది.

India reported over 24L online child abuse cases
ఆన్​లైన్​లో చిన్నారులపై ​వేధింపులు

By

Published : Nov 18, 2021, 5:47 AM IST

దేశంలో.. గడచిన మూడేళ్లలో ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు భారీగా పెరిగినట్లు ఇంటర్​పోల్​ నివేదికలో తేలింది. 2017-2020 వరకు 24లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు స్పష్టమైంది. బాధితుల్లో 80శాతం మంది 14ఏళ్లలోపు బాలికలేనని తేల్చింది.

అంతర్జాలంలో పోర్న్​ సమాచారాన్ని పొందుపరచడం కూడా భారీస్థాయిలో పెరిగిపోతుందని ఇంటర్​పోల్​ అందించిన నివేదికలో వెల్లడైంది.

ఈ క్రమంలో.. ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలపై దృష్టిసారించింది సీబీఐ. ఆ గ్యాంగ్​లే లక్ష్యంగా ఇటీవల దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 50 ఆన్​లైన్ సోషల్​ మీడియా గ్రూప్స్​ ద్వారా దాదాపు 5వేల మంది.. ఈ పోర్న్ సమాచారాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తున్నట్లు గుర్తించింది సీబీఐ. దీంతో ప్రపంచంలోని దర్యాప్తు శాఖలతో కలిసి సీబీఐ పనిచేయనుంది. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది సీబీఐ. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్​ సహా.. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.

ఇదీ చూడండి:యూపీలో ఘోరం.. 72ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details