తెలంగాణ

telangana

By

Published : May 3, 2021, 9:27 AM IST

Updated : May 3, 2021, 9:44 AM IST

ETV Bharat / bharat

దేశంలో మరో 3.68 లక్షల మందికి కరోనా​

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 3.68 లక్షల‬ మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధరణ అయ్యింది.​ కొవిడ్​ కారణంగా మరో 3,417 మంది ప్రాణాలు కోల్పోయారు.

Corona, Covid-19
కరోనా, కొవిడ్​-19

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర స్థాయిలో కొత్తగా 3,68,147 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ బారినపడిన వారిలో మరో 3,417 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 1,99,25,604
  • మొత్తం మరణాలు: 2,18,959
  • మొత్తం కోలుకున్నవారు: 16,29,3003
  • యాక్టివ్ కేసులు: 34,13,642

ఇదీ చదవండి:కరోనా 'మహా' విలయం- మరో 56వేల కేసులు

కొవిడ్ సోకిన వారిలో 3,00,732 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 81.77 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.71 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీ చదవండి:బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు

Last Updated : May 3, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details