దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 13,203 వైరస్ కేసులు వెలుగుచూశాయి. మరో 131 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,06,67,736కు చేరగా.. మరణాల సంఖ్య 1,53,470కి పెరిగింది.
తాజాగా 13వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,03,84,000లకు చేరింది. 1.84 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.44శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.