తెలంగాణ

telangana

దేశంలో రికార్డు స్థాయిలో టీకా పంపిణీ

By

Published : Apr 6, 2021, 12:33 PM IST

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 43లక్షలకుపైగా మందికి వ్యాక్సిన్​ అందించింది ప్రభుత్వం.

India records highest single-day vaccination coverage
దేశంలో రికార్డు స్థాయిలో టీకా పంపిణీ

దేశంలో సోమవారం ఒక్కరోజులోనే 43లక్షలకుపైగా కరోనా టీకా డోసులను అందించింది ప్రభుత్వం. టీకా సరఫరా కార్యక్రమంలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

ఇందులో 39,00,505 మందికి మొదటి డోసు, 4,00,461 మందికి రెండో డోసు ఇచ్చింది.

మొత్తం టీకాల పంపిణీలో మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​, కర్ణాటక, మధ్యప్రదేశ్​, కేరళకు 60శాతం వాటా ఉంది.

దేశంలో ఇప్పటివరకు 8,31,10,926 టీకా డోసులను పంపిణీ చేశారు. టీకా పంపిణీలో.. మహారాష్ట్ర(81,27,248), గుజరాత్​(76,89,507), రాజస్థాన్​(72,99,305), ఉత్తర్​ప్రదేశ్​(71,98,372), బంగాల్​(65,41,370) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:-భారత్​లో మరో 97 వేల మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details