భారత నారీశక్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి! జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)లోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం లభించింది. 100 మందికిపైగా అతివలతో కూడిన మొదటి బృందం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఈ దళంలో చేరింది. ప్రస్తుతం ఈ బృందాన్ని ఉత్తర్ప్రదేశ్లోని గఢ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగా నది ఒడ్డున అత్యవసర విధుల నిర్వహణ కోసం మోహరించారు. వీరు సహాయ పడవలు, ఇతర సాధన సంపత్తిని నిర్వహిస్తున్నారని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్లో తొలి నారీ దళం - ఎన్డీఆర్ఎఫ్లోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)లోకి తొలిసారిగా మహిళలకు చోటు లభించింది. 100 మందికిపైగా మహిళలతో కూడిన మొదటి బృందం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది.
![ఎన్డీఆర్ఎఫ్లో తొలి నారీ దళం first women's team in disaster combat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10133730-879-10133730-1609878985997.jpg)
ఎన్డీఆర్ఎఫ్లో తొలి నారీ దళం
విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాల నైపుణ్యాలను వీరు కలిగి ఉన్నారని చెప్పారు ప్రధాన్. ముఖ్యంగా మహిళలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. సమీప భవిష్యత్లో ఈ దళ బలాన్ని 200కు పెంచనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:యువకుడిని చంపిన యువతిని కాపాడిన పోలీసులు