భారత్లో కొత్తగా 16,838 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 11 లక్షల 73 వేలు దాటింది. మరో 113 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 57 వేల 548కి చేరింది.
తాజాగా 13,819 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,08,39,894 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. 1,76,319 క్రియాశీలక కేసులున్నాయి.