తెలంగాణ

telangana

కరోనా ఉగ్రరూపం: భారత్​లో ఒక్కరోజే 2 లక్షల కేసులు

By

Published : Apr 15, 2021, 9:38 AM IST

Updated : Apr 15, 2021, 10:06 AM IST

దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 2,00,739 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. కొవిడ్​​ బారినపడిన వారిలో మరో 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona
దేశంలో కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ విలయ తాండవం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజువారి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2,00,739 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. వైరస్​ ధాటికి మరో 1,038 మంది బలయ్యారు.

  • మొత్తం కేసులు:1,40,74,564
  • మొత్తం మరణాలు:1,73,123
  • కోలుకున్న వారు:1,24,29,564
  • యాక్టివ్​ కేసులు:14,71,877

కొవిడ్​ సోకిన వారిలో బుధవారం 93,528 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 13 లక్షల 84 వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఇప్పటివరకు 26 కోట్ల 20 లక్షల నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది.

ఇప్పటివరకు మొత్తం 11,44,93,238​ డోసుల టీకా పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:శ్మశానాలకు కుప్పలుగా కొవిడ్​ మృతదేహాలు

ఇదీ చూడండి:కొవిడ్‌పై నిర్ణయాత్మక పోరు!

Last Updated : Apr 15, 2021, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details