తెలంగాణ

telangana

'అలా చేస్తే 5% లోపే పాజిటివిటీ రేటు'

కొవిడ్​ను ఎదుర్కోవడంలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. రానున్న మూడు వారాల్లోనే భారత్​లో వైరస్​ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువకు చేరుకోగలదని దిల్లీ ఎయిమ్స్​కు చెందిన డాక్టర్​ నవ్​నీత్​ విగ్​ తెలిపారు. వైరస్​ను ఓడించాలంటే ముందు ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాలని సూచించారు.

By

Published : Apr 25, 2021, 10:36 PM IST

Published : Apr 25, 2021, 10:36 PM IST

AIIMS doctor
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు

రానున్న మూడు వారాల్లోనే.. కరోనా వైరస్​ పాజిటివిటీ రేటును 5 శాతం కంటే తక్కువకు భారత్​ పరిమితం చేయగలుగుతుందని దిల్లీ ఎయిమ్స్​లోని ఔషధ విభాగాధిపతి డాక్టర్​ నవనీత్​ విగ్​ పేర్కొన్నారు. అయితే.. ఇందుకు అందరూ బాధ్యతాయుతంగా కొవిడ్​పై పోరు సాగించాలని తెలిపారు. కరోనా​ పరిస్థితులపై ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​దీప్​ గులేరియా, డీజీహెచ్​ఎస్ డైరెక్టర్​ జనరల్​​ సునీల్​ కుమార్​, ఛైర్మన్​ డాక్టర్​ నరేష్​ త్రెహాన్​ల సంయుక్త సమావేశంలో డాక్టర్​ నవ్​నీత్​ పాల్గొన్నారు.

"కొవిడ్​ను ఎదుర్కోవడంలో మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే... భారత్​లో వైరస్​ పాజిటివిటీ రేటును 5 శాతం కంటే తక్కువకు పరిమితం చేయవచ్చు. అన్ని జిల్లాల అధికారులు.. జిల్లాలోని పాజిటివిటీ రేటును పర్యవేక్షించాలి, 1-5 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలి. ముంబయిలో ఒకానొక దశలో వైరస్​ పాజిటివిటీ రేటు 26 శాతంగా ఉండేది. కొన్ని కఠిన చర్యలు చేపట్టిన తర్వాత.. అది 14 శాతానికి చేరింది. దిల్లీలో ప్రస్తుతం వైరస్​ పాజిటివిటీ రేటు 30 శాతంగా ఉంది. మనం తప్పనిసరిగా కఠిన నిబంధనలు అమలు చేయాలి."

-నవ్​నీత్​ విగ్​, దిల్లీ ఎయిమ్స్​ ఔషధ విభాగాధిపతి.

వ్యాధిని ఓడించాలంటే ముందు ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాలని నవ్​నీత్​ విగ్​ పేర్కొన్నారు. "ఆరోగ్య సిబ్బందిని కాపాడితేనే.. వాళ్లు రోగులను కాపాడుతారు. వాళ్లిద్దరినీ మనం కాపాడినట్లైతే.. ఆర్థిక వ్యవస్థను వాళ్లు కాపాడుతారు"అని చెప్పారు.

ఇదీ చూడండి:కరోనా ఆంక్షల మధ్య యువకుడి 'బైక్​ బరాత్'​

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్ 3.0పై కేంద్రం కీలక మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details