తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంపేస్తామని బెదిరించి.. ఎంపీ నివాసంపై కాల్పులు

రాజస్థాన్​ భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై (attack on bjp leaders) మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపు లేఖను ఇంటికి అతికించారు.

By

Published : Nov 10, 2021, 12:21 PM IST

Bharatpur MP Ranjeeta Koli
ఎంపీ రంజీత కోలీ నివాసంపై కాల్పులు

రాజస్థాన్​లో భాజపా ఎమ్మెల్యే అమృత మేఘవాలాపై దాడి (attack on bjp leaders) మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భరత్​పుర్​ జిల్లా, బయనాలో ఉన్న భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపులతో కూడిన లేఖను ఇంటికి (attack on bjp leaders in rajasthan) అతికించారు. ఈ ఘటనలో ఎంపీ కోలీ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

'నీ స్థాయికి మించిన పనుల్లో తలదూర్చితే నేరుగా కాల్చి చంపేస్తాం. ఎవరూ నిన్ను కాపాడలేరు.' అంటూ లేఖలో ఎంపీని దుండగులు బెదిరించారు. ఈ ఏడాది మే 27న కోలీ కారుపై దుండగులు దాడి చేశారు. ఫోన్​చేసి చంపేస్తామంటూ బెదిరించారు. ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడ్డారు.

ఎంపీ రంజీత కోలి నివాసంపై కాల్పులు

ఇదీ చదవండి:66 కిలోల డ్రగ్స్ సీజ్.. విలువ రూ.350 కోట్లకు పైనే...

ABOUT THE AUTHOR

...view details