తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూమిని విరాళంగా ఇచ్చి.. మత సామరస్యాన్ని చాటి.. - శివాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం

ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శివాలయానికి తమ భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది.

In Meerut, a Muslim family donated land for a temple - an example of national unity.
శివాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం

By

Published : Nov 17, 2020, 7:01 PM IST

ఉత్తర్​ ప్రదేశ్​లోని ఓ ముస్లిం కుటుంబం చేసి పని మత సామరస్యాన్ని చాటింది. తమ భూమిని శివాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి మతాలకు అతీతంగా నిలిచింది. దేవాలయ నిర్మాణానికి సైతం అందరూ తరలిరావాలని స్థానికులకు ఆ కుటుంబం పిలుపునిచ్చింది.

భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం
హిందూ-ముస్లిం ఐక్యత

ఉత్తర్​ ప్రదేశ్​ మేరఠ్​ రషీద్​నగర్​కు చెందిన ఖాసీం​ అలీకి బ్రహ్మపురిలో 200యార్డుల భూమి ఉండేది. 1976లో ఆ భూమిని ఖాసీం​ అలీ శివాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ఖాసీం కుమారుడు అసీమ్​ ఆ భూమిని శివాలయం నిర్మాణం కోసం ఇటీవల మందిర్ సమితి పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించారు. అంతేకాకుండా శివాలయ నిర్మాణానికి మతాలకు అతీతంగా అందరూ రావాలని ఖాసీం కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు.

'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతున్న ఖాసీం కుటుంబ సభ్యుడు
భూమి పత్రాలు

ABOUT THE AUTHOR

...view details