తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రెండు రోజులు లోక్​సభ పనికాలం 150శాతం! - పార్లమెంట్​ సమావేశాలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు గత సోమ, మంగళవారాల్లో లోక్​సభ అర్ధరాత్రి వరకు పనిచేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు సభ సగటు పనికాలం ఏకంగా 150శాతానికిపైగా నమోదైనట్లు లోక్​సభ సచివాలయం వెల్లడించింది.

Lok sabha
లోక్​సభ సగటు ఉత్పాదకత

By

Published : Feb 11, 2021, 10:10 AM IST

బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా.. లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం నుంచే వాయిదాల పర్వం కొనసాగింది. సాగు చట్టాలపై విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ అట్టుడికింది. అయితే.. లోక్​సభ స్పీకర్​ అభ్యర్థన మేరకు ఈ తీర్మానంపై చర్చించేందుకు గత మంగళవారం ఏకంగా రాత్రి 1 గంట వరకు సభలోనే ఉన్నారు సభ్యులు. ఈ క్రమంలో గడిచిన సోమ, మంగళవారాల్లో సభ సగటు పనికాలం ఏకంగా 150 శాతానికిపైగా నమోదైనట్లు లోక్​సభ సచివాలయం వెల్లడించింది.

గత మంగళవారం సభను ముందుగా రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఆ తర్వాత రాత్రి 1 గంటకు పెంచారు. దాంతో సభ పనికాలం సుమారు రెండింతలకు చేరింది.

ఫిబ్రవరి 8న సభ పనికాలం 142 శాతం, ఫిబ్రవరి 9న పనికాలం ఏకంగా 180 శాతంగా నమోదైంది. సోమ, మంగళవారాల్లో 69 మంది మాట్లాడగా, 62 మంది తమ ప్రసంగాలను సభ ముందుకు తీసుకొచ్చారు. సభలో ప్రతిఒక్కరికి సరిపడా సమయాన్ని స్పీకర్​ కేటాయించారని సచివాలయం వెల్లడించింది.

'ఎంపీ ల్యాడ్స్​ నిధులు కావాలి..'

కరోనా సంక్షోభం కారణంగా.. గతేడాది నిలిపివేసిన ఎంపీ ల్యాడ్స్​( పార్లమెంట్​ నియోజకవర్గ అభివృద్ధి పథకం)ను పునరుద్ధరించాలని వివిధ పార్టీలకు చెందిన అనేకమంది ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజలు సమస్యలతో తమ వద్దకు వస్తుంటే.. వాటిని పరిష్కరించలేకపోతున్నామని చెబుతున్నారు.

ఈ పథకం కింద ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఏటా రూ. 5కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కరోనా వల్ల దీనిని రెండేళ్ల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చూడండి:సొరంగంలోని వారి కోసం జోరుగా సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details