ఉత్తరాఖండ్ తపోవన్ సమీపంలో ఏర్పడిన హిమ సరస్సు లోతును కొలిచేందుకు భారత వాయుసేన, నావికా దళం కలిసి రంగంలోకి దిగాయి. వాయుసేనకు చెందిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్(ఏఎల్హెచ్)లో బయలుదేరిన నేవీ డైవర్లు సరస్సు లోతును అంచనా వేస్తున్నారు.
రహదారులు సరిగా లేకపోవడం, అత్యవసరంగా సరస్సు లోతును తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాయుసేన, నేవీ కలిసి శనివారం ఈ ఆపరేషన్ను ప్రారంభించాయి. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చేతిలో ఇమిడే ఎకో సౌండర్తో లోతును కొలుస్తున్నారని నేవీ తెలిపింది.