తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ - మెడిసిన్​ వ్యవస్థ ఏకీకృతం

ఆధునిక- సంప్రదాయ ఔషధ వ్యవస్థలను ఒక్కటి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యతిరేకించారు ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా. అశోకన్​. ఇదే జరిగితే దేశ ఔషధ వ్యవస్థ వెనకడుగు వేసినట్టేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు అశాస్త్రీయమని తేల్చిచెప్పారు.

IMA criticises Centre's move to integrate all systems of medicines
ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ

By

Published : Nov 20, 2020, 10:32 AM IST

డా. అశోకన్​ ఇంటర్వ్యూ

అన్ని రకాల ఔషధ వ్యవస్థలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఐఎంఏ (ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​) బహిరంగంగా వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయంతో ఇన్నేళ్ల శ్రమ వృథా అయ్యి దేశం తిరిగి వెనకడుగు వేస్తుందని.. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా. ఆర్​వీ అశోకన్​.

ఆధునిక ఔషధ రంగాన్ని సంప్రదాయ ఔషధ వ్యవస్థలైన ఆయుర్వేదం, యోగా, హోమియోపతితో ఏకీకృతం చేసేందుకు ఇటీవలే నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్​. ఫలితంగా.. వైద్య విద్య, క్లినికల్​ ప్రాక్టీస్​, ప్రజా ఆరోగ్యం, యంత్రాంగం, వైద్య పరిశోధనలపై ఈ ప్రభావం పడుతుంది.

"ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఈరోజున ఒక్కో పద్ధతికి ఒక్కో వ్యవస్థ ఉంది. దేనిని ఎంచుకోవాలనేది ప్రజల ఇష్టం. ఇప్పుడు విద్య నుంచి పరిశోధన వరకు అన్నింటినీ కలిపేయడం అనేది అశాస్త్రీయం. ఇది ఆధునిక- సంప్రదాయ మెడిసిన్​కు హానికరం. ఆరోగ్య వ్యవస్థ, అది సాధించిన ఘనతపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది."

--- డా. అశోకన్​, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి

ఆధునిక ఔషధ రంగాన్ని సంప్రదాయ వ్యవస్థలకు అనుసంధానిస్తూ జాతీయ విద్యా విధానం(ఎన్​ఈపీ)లో వ్యూహాలు రచించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. దీనిని తప్పుబడతూ ఇప్పటికే కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాసింది ఐఎంఏ. దీని ద్వారా సంప్రదాయ ఔషధ వ్యవస్థలు లబ్ధిపొందుతాయనుకుంటే పొరబడినట్టేనని పేర్కొన్నారు డా. అశోకన్​.

ఇదీ చూడండి:-పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details