తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2021, 11:51 PM IST

ETV Bharat / bharat

Omicron Effect: మరో అరవై రోజుల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌!

omicron third wave: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్​ ప్రభావంతో రానున్న రోజుల్లో స్వల్ప స్థాయిలో మూడో దశ కరోనా ముప్పు ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. గతంలో డెల్టా విజృంభణ సమయంలో విధించిన రాత్రిపూట కర్ఫ్యూ, జనసమూహాల నియంత్రణ వంటి ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చని సూచించారు.

third wave
థర్డ్‌వేవ్‌

corona third wave news in india: డెల్టా ప్రభావంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలను.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి.

omicron news update: ఇలాంటి సమయంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించనుందని.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. దేశంలో మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్ర పరంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్‌'ను ఈయనే రూపొందించారు.

"భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య వచ్చే ఏడాది తొలి మాసంలో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్‌ కట్టడి చర్యల ద్వారా మూడోవేవ్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు"

---మనీంద్ర అగర్వాల్‌

omicron cases in india: ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించవచ్చని మనీంద్ర అగర్వాల్‌ వెల్లడించారు. గతంలో డెల్టా ప్రభావం చూపించినప్పుడు మాదిరిగానే రాత్రిపూట కర్ఫ్యూ, జనసమూహాలను నియంత్రించడం వంటి ఆంక్షల ద్వారా దీని తీవ్రతను నియంత్రించవచ్చని సూచించారు. దీంతో మూడోవేవ్‌లో గరిష్ఠంగా పెరిగే కేసులను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.

ఒమిక్రాన్‌కు సంక్రమణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకే కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి వెళ్లినప్పటికీ ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు. దేశంలో థర్డ్‌వేవ్‌ ఖాయమన్న ఆయన.. అది ఏమేరకు ప్రభావాన్ని చూపుతుందనే విషయం ప్రభుత్వాలు తీసుకునే కట్టడి చర్యలపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details