పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఐఎఫ్ఎస్ అధికారి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే:అంశుమాన్ రాజహంస 2020 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఇంజనీర్తో 2017లో పరిచయం ఏర్పడింది. ఈమె సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కోసం దిల్లీలోని రాజేంద్ర నగర్కు వచ్చింది. అప్పుడే రాజహంసతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వివాహానికి ముందే ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. 2018 సివిల్స్లో రాజహంసకు ఐఆర్టిఎస్ ర్యాంకు వచ్చింది. అనంతరం సివిల్స్ ఉన్నత క్యాడర్ ఉన్న ఉద్యోగాన్ని సాధించి పెళ్లి చేసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చాడు రాజహంస. 2020లో ఐఎఫ్ఎస్కు ఎంపికైన తర్వాత తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అయితే ఆ సమయంలో ఫొటోలు తీయడానికి అతను అనుమతించలేదని బాధితురాలు తెలిపింది.