కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఈటీవీ భారత్తో అన్నారు. అయితే 4-6 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఐసీఎంఆర్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.
'మరో 4 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం' - కరోనా
దేశంలో ఎక్కువ మంది ప్రజలు కరోనా బారిన పడడానికి కారణం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్లో ఉన్న మూడు విదేశీ కరోనా వేరియంట్లు దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడానికి కారణమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
!['మరో 4 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం' Covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11592862-963-11592862-1619789868836.jpg)
కరోనా
మూడు దేశాల కరోనా డబుల్ మ్యూటెంట్ వైరస్, భారత మ్యూటెంట్ వైరస్ వల్ల దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోందని తెలిపారు. ఇండియాలో బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన కరోనా వేరియంట్లు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:భారత్ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం