తెలంగాణ

telangana

కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి

By

Published : May 11, 2021, 12:55 PM IST

కుటుంబ సభ్యులకు తమ నుంచి కరోనా సోకుతుందేమోనన్న భయంతో కర్ణాటకలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వృద్ధురాలు ఉరేసుకొని చనిపోగా.. మరో వ్యక్తి తుపాకీతో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు.

'I might spread corona virus to my Family' - Two people commiited suicide in two separate cases
కరోనా భయం- తుపాకీతో కాల్చుకొని మృతి

కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందేమోనని ఓ విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కర్ణాటక చిక్కమగళూరులోని బెలెనహళ్లి గ్రామానికి చెందిన సోమనాయక్​కు.. కొద్దిరోజుల క్రితం కరోనా వచ్చింది. దీంతో సూసైడ్ నోట్ రాసి కారులోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. తన కుటుంబానికి కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతోనే తనువు చాలిస్తున్నట్లు నోట్​లో పేర్కొన్నాడు.

కారులోనే ఆత్మహత్య చేసుకున్న సోమనాయక్
సోమనాయక్ మృతదేహం

మరోవైపు, చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ తాలుకాలో సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఇక్కడహళ్లి గ్రామానికి చెందిన 70ఏళ్ల సిద్ధమ్మకు మే 1న కొవిడ్ సోకింది. వైద్యుల సిఫార్సు మేరకు ఆ వృద్ధురాలు హోంక్వారంటైన్​లో ఉంది. అయితే, ఇంట్లోని చిన్నపిల్లలకు తన నుంచి కరోనా సోకుతుందన్న భయంతో మే 3న ఉరేసుకుని చనిపోయింది.

ఉరేసుకొని చనిపోయిన వృద్ధురాలి కుటుంబ సభ్యులు

ఇదీ చదవండి:ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ABOUT THE AUTHOR

...view details