తెలంగాణ

telangana

అలా చేస్తేనే.. రామాలయానికి విరాళం ఇస్తా: వాద్రా

By

Published : Feb 26, 2021, 4:21 PM IST

దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్​ వాద్రా. పెట్రోలు, డీజిల్​ పన్నుల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలన్నారు. మరోవైపు రామాలయ విరాళాల సేకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు వాద్రా.

'I am secular', says Robert Vadra on temple donation
అలా చేస్తేనే.. రామాలయానికి విరాళం ఇస్తా: రాబర్ట్​ వాద్రా

దేశంలోని ఇతర మత నిర్మాణాలకూ నిధులు సేకరించినప్పుడు.. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి విరాళం ఇస్తానని వాఖ్యానించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్​ వాద్రా. ఒకరోజు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన ఆయన.. జైపుర్​లోని ప్రసిద్ధ మోతీ డుంగరీ ఆలయాన్ని సందర్శించారు. తాను లౌకికవాదినని.. దేశ ప్రజలు ప్రశాంతంగా మతసామర్యంతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు వాద్రా.

చర్చి, మసీదు, గురుద్వారాల నిర్మాణాలకు విరాళాలు సేకరించినప్పుడే.. అయోధ్య నిర్మాణానికీ విరాళం ఇస్తానని ఉద్ఘాటించారు.

'ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతుల నిరసనపై స్పందించిన రాబర్ట్.. "దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రెండు నెలలకుపైగా అన్నదాతలు నిరసనలు నిర్వహిస్తున్నారు. అయితే వారి పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది." అని ఆరోపించారు.

మరోవైపు పెట్రోలు, డీజిల్​ పన్నుల నుంచి సామాన్య ప్రజలకు కేంద్రం ఉపశమనం కల్పించాలన్నారు.

'న్యాయవ్యవస్థను నమ్ముతాను'

వజ్ర వ్యాపారవేత్త నీరవ్​ మోదీని రప్పించడంపై సంతృప్తి వ్యక్తం చేసిన వాద్రా.. దేశ న్యాయవ్యవస్థను తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రతిపక్షానికి స్థానికుల నుంచి మద్దతు లభిస్తోందని.. అయితే ప్రభుత్వ అణచివేత విధానాల నుంచి ప్రజలకు సాయం చేసే దిశలో కాంగ్రెస్​ పనిచేస్తోందన్నారు రాబర్ట్​.

ఇదీ చూడండి:ధరలు తగ్గించాలని ఆటో లాగిన థరూర్.​. సైకిలెక్కిన తేజస్వీ

ABOUT THE AUTHOR

...view details