హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించారు. 48 ఏళ్ల శ్యామలా గోలీ శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ఉన్న అరిచల్ మునయ్ బీచ్ వరకు ఈత కొట్టారు. శ్రీలంక నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి కేవలం 13 గంటల 40 నిమిషాల్లో చేరుకోవడం విశేషం. తలైమన్నార్ నుంచి శుక్రవారం ఉదయం 4.10 గంటలకు ఈత ప్రారంభించి.. సాయంత్రం 5.50 గంటలకు ధనుష్కోడి చేరుకున్నారు. పల్క్ స్ట్రెయిట్లో ఈదిన రెండవ భారతీయురాలిగా రికార్డు సృష్టించారు.
"పల్క్ స్ట్రెయిట్లో ఈత కొట్టేందుకు భారత్, శ్రీలంకల నుంచి గతేడాదే అనుమతి లభించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఓ మహిళగా నేను నెలకొల్పిన రికార్డు ఇతరలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నా."
-శ్యామలా గోలీ