తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2021, 6:04 AM IST

ETV Bharat / bharat

Gandhi Jayanti: స్వాతంత్య్ర సంగ్రామానికి ఊపిరి 'సేవాగ్రామ్'

సబర్మతి నుంచి దండి మార్చి(dandi march) ప్రారంభించిన గాంధీజీ(Gandhi Jayanti) .. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే సబర్మతిలో తిరిగి అడుగుపెడతానని శపథం చేశారు. మరి అందాకా మహాత్ముడు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిహితులు ఎంపిక చేసిన ఆశ్రమమే సేవాగ్రామం(gandhi sevagram ashram). భారత స్వాతంత్ర్యోద్యమంలో(Indian independence movement) కీలకంగా మారిన సేవాగ్రామ్​పై ప్రత్యేక కథనం.

Sevagram
సేవాగ్రామ్‌ ఆశ్రమం

స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరి 'సేవాగ్రామ్'

రణభేరి మోగింది సబర్మతిలో. కానీ బ్రిటిష్ వాళ్ల వెన్నులో చలిపుట్టించింది, స్వాతంత్ర్యోద్యమానికి (Indian independence movement) కాకపుట్టించింది మాత్రం ఆ పుణ్య ధామమే. అదే సేవాగ్రామ్‌(gandhi sevagram ashram). సబర్మతి నుంచి దండి మార్చి ప్రారంభించిన గాంధీజీ(Gandhi Jayanti).. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే సబర్మతిలో తిరిగి అడుగుపెడతానని శపథం చేశారు. మరి అందాకా మహాత్ముడు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిహితులు ఎంపిక చేసిన ఆశ్రమమే సేవాగ్రామం(sevagram ashram wardha). క్విట్ ఇండియా రణనినాదంతో దేశవ్యాప్త ఉద్యమానికి ఊపిరి ఊదిన సేవాగ్రామ్ పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

గాంధీజీ(Gandhi Jayanti) సబర్మతి ఆశ్రమం(sabarmati ashram) నుంచి దండి యాత్రకు(dandi march) బయలుదేరినప్పుడు ఒక శపథం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా తిరిగి సబర్మతిలో అడుగు పెట్టేది లేదని నిర్ణయించారు. దండి యాత్ర సందర్భంలో బ్రిటిషర్లు గాంధీని అరెస్టు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత గాంధీని విడుదల చేశారు. అప్పుడు బయటకు వచ్చిన గాంధీజీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక గ్రామాన్ని స్వాతంత్ర్యోద్యమానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు.

స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరి 'సేవాగ్రామ్'

"స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించాలని నిశ్చయించారు. స్వాతంత్ర్యం సిద్ధించేదాకా సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టకూడదన్నది ఆయన నిర్ణయం. మరి గాంధీజీ ఎక్కడ ఉండాలి? అనే అంశంపై ఆయన అనుయాయులు చర్చించారు. అప్పుడు జమ్నాలాల్ బజాజ్ వార్ధాలో ఓ ప్రదేశాన్ని చూపించారు. ఆ ప్రదేశ ప్రాముఖ్యతను గాంధీజీకి చెప్పి ఒప్పించారు."

- డా. శివచరణ్ ఠాకూర్, నయి తాలిమ్, సేవాగ్రామ్‌ ఆశ్రమం

జమ్నాలాల్ బజాజ్ అభ్యర్ధనతో గాంధీజీ నేడు వార్ధాగా ప్రాచుర్యం పొందిన నాటి పాలక్ వాడీలో అడుగుపెట్టారు. మొదటి సత్యాగ్రహి ఆశ్రమంలో ఆయన బసచేశారు. 1935 జనవరిలో గాంధీ మాగన్ వాడీలో గడిపారు. అదే సమయంలో మీరాబెన్ కోసం ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసే బాధ్యతను గాంధీజీ అనుయాయులకు అప్పగించారు.

ఆది నివాస్​..

మహాత్మా గాంధీ 1936 ఏప్రిల్ 30న తొలిసారి సేవాగ్రామ్‌ ఆశ్రమంలో(gandhi sevagram ashram) అడుగు పెట్టారు. అంతకు ముందు ఏప్రిల్ 17న ఆయన షెహగాన్ గ్రామవాసులను సేవాగ్రామ్ వద్ద కలుసుకున్నారు. ఆయన తొలిసారి అంటే..ఏప్రిల్ 30న అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఉండేదుకు గుడిసె కూడా లేదు. ఆ సమయంలో గాంధీజీ ఆ సమీపంలోని జామతోట బావి దగ్గర ఓ గుడిసెలో బస చేశారు. ఇక్కడ ఆయన ఐదేళ్లు ఉన్నారు. అప్పుడు గాంధీ(Gandhi Jayanti) అక్కడ ఓ కుటీరాన్ని సిద్ధం చేయాలని జమ్నాలాల్ బజాజ్​ను కోరారు. ఆ కుటీరం ఒక సామాన్యుడి ఇంటిలా ఉండాలని సూచించారు. గుడిసె నిర్మాణ వ్యయం వంద రూపాయలు మించరాదని షరతు విధించారు. స్థానిక వనరులను ఉపయోగించి, అక్కడి వారి సహాయంతో నిర్మించాలని సూచించారు. ఆ తరువాత 1936 మే 5న గాంధీజీ ఖాదీయాత్రకు బయలుదేరారు.

ఆయన 1936 జూన్ 16వ తేదీన తిరిగి వచ్చారు. అప్పటికి ఆది నివాస్ సిద్ధమైంది. ఆ కుటీరాన్ని మీరాబెన్, బల్వంత్ సింగ్ గ్రామస్థుల సాయంతో నెలరోజుల వ్యవధిలో నిర్మించారు. నిర్మాణానికి 499 రూపాయల వ్యయం అయ్యింది. ఈ విషయం తెలిసి బాపూజీ కలత చెందారు. అంత వ్యయానికి కారణాన్ని జమ్నాలాల్ బజాజ్ గాంధీజీకి(Gandhi Jayanti) అవగతమయ్యేలా వివరించారు.

బాపు కుటి..

ఆ తరువాత బాపు 1937చివరలో మీరాబెన్ నివసించిన ఈ కుటీరానికి మారారు. ఇదే కుటీరాన్ని నేడు 'బాపు కుటి'గా పిలుస్తున్నారు. తొలుత ఇది చాలా చిన్నదిగా ఉండేది. బాపు వచ్చిన తర్వాత విస్తరించారు. కుటీరంలో ఒక బాత్ రూమ్, వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో స్వాతంత్ర్యోద్యమానికి(Indian independence movement) సంబంధించి అనేక సమావేశాలను నిర్వహించారు.

" సేవాగ్రామ్ స్వాతంత్ర్య పోరాటానికి ముఖ్య కేంద్రమైంది. అనేక ముఖ్య నిర్ణయాలను ఇక్కడే తీసుకున్నారు. అనేక మంది ముఖ్య నేతలు సలహాల కోసం, మార్గదర్శనం కోసం బాపూజీని కలిసేవారు."

- నాథూజీ చవాన్, విద్యార్థి, ఆనందనికేతన్, సేవాగ్రామ్‌

తనకు ఒక ప్రత్యేక కుటీరం లేనందువల్ల బాపూజీకి సేవాగ్రామ్ ఆశ్రమంలో(gandhi sevagram ashram) కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇది మనసులో ఉంచుకుని జమ్నాలాల్ బజాజ్ గాంధీజీ కోసం ప్రత్యేక కుటీరాన్ని నిర్మించారు. నాడు గాంధీ ఉపయోగించిన వివిధ వస్తువులు సేవాగ్రామ్​లో నేటికీ చూడవచ్చు. వీటిల్లో బాపూజీ లాంతర్​, రామాయణం, బైబిల్, ఖురాన్ పుస్తకాలను ఒక ప్రత్యేక అల్మారాలో ఉంచారు. ఇవేకాకుండా పేపర్ వెయిట్స్, టూత్ పిక్స్, ఊమ్మి తొట్లు, పెన్ను, పెన్సిల్ స్టాండులు, మూడు కోతుల శిల్పాన్ని చూడవచ్చు. ఇంకా సూది-దారం, చరఖా పెట్టె, రోజరీ, చెక్క ట్రోఫీ, రాతి పేపర్ వెయిట్, వేళ్లు రుద్దుకునే స్క్రబ్బర్ ఉన్నాయి. గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ లిన్ లితిగోతో నేరుగా మాట్లాడేందుకు వీలుగా ఒక సెట్ హాట్ లైన్ ఫోను ఉండేది. లిన్ లితిగో ...బాపూజీని ముఖ్యాంశాలపై ఏ సమయంలోనైనా సంప్రదించేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. క్విట్ ఇండియా లేదా 'భారత్ ఛోడో' నినాదం సేవాగ్రామ్​లోనే పుట్టి దేశమంతా రణనినాదమై మోగింది.

1942 జూలై 9వ తేదీన సేవాగ్రామ్​లో ఒక ముఖ్య సమావేశం జరిగింది. బ్రిటిషర్లారా దేశం విడిచిపెట్టి పోండి అనే నినాదం ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా తేలిక పదాలతో ఉండాలని బాపూజీ ఆశించారు. యూసఫ్‌ మెహ్రాలీ సూచించిన గో బ్యాక్, క్విట్ ఇండియా నినాదాల నుంచి గాంధీ(Gandhi Jayanti) క్విట్ ఇండియా నినాదాన్ని ఎంపిక చేశారు. క్విట్ ఇండియా నినాదం అలా పుట్టింది.

ఇదీ చూడండి:గాంధీ 150: విద్యకు నిజమైన అర్థం చెప్పిన బాపూజీ

ABOUT THE AUTHOR

...view details