తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 7 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - ఈనాడు రాశి ఫలాలు

ఈ రోజు(ఆగస్టు 7) రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

today horoscope
రాశి ఫలాలు

By

Published : Aug 7, 2021, 5:16 AM IST

ఆగస్టు 7వ తేదీన ఈ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణ శుభకరం.

వృషభం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదేవతా ఆరాధన మంచిది.

మిథునం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. నారాయణ మంత్రాన్ని జపించాలి.

కర్కాటకం

చేపట్టే పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.

సింహం

చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

కన్య

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

తుల

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి చేకూరుతుంది.లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి.

ధనుస్సు

శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

మకరం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర దర్శనం మంచిది.

కుంభం

ధర్మసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

మీనం

శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాల్లోకి తలదూర్చకండి. హనుమాన్ చాలీసా పఠనం మంచిది.

ABOUT THE AUTHOR

...view details