తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (20-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - తెలుగు జాతకం

Horoscope Today (20-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలం

By

Published : Apr 20, 2022, 4:03 AM IST

Horoscope Today (20-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్​ నామ సంవత్సరం;

ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం;

బహుళ పక్షం చవితి; సా. 5.09 తదుపరి పంచమి జ్యేష్ఠ తె. 3.01 తదుపరి మూల

వర్జ్యం ఉ.10.16 నుంచి 11.34 వరకు అమృత ఘడియలు రా.6.50 నుంచి 8.19 వరకు,

దుర్ముహూర్తం: ఉ.11.33 నుంచి 12.23 వరకు

రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5.45, సూర్యాస్తమయం: సా.6.12

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి.

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి చేకూరుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభకరం.

ఉత్సాహంగా పనిచేస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద, కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమం.

మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి, శ్రీవేంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

ఇదీ చూడండి :దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా విషాదం.. కుటుంబంలోని 11 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details