తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహమ్మారిని తరిమికొట్టేందుకు 'హోరాబేదు' ఉత్సవం! - శివమొగ్గ వార్తలు

పూర్వీకులు చేసిన ఏ పనికైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. నాడు అమలు చేసిన ఏ ఆచారానికైనా ఓ శాస్త్రీయ కారణం ఉండే ఉంటుంది. అలాంటి శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తూ.. కర్ణాటకలో ఇటీవల ఓ పండుగను నిర్వహించారు కన్నడిగులు. ఇంతకీ ఏమిటా ఉత్సవం? దాని వెనకున్న శాస్త్రీయత ఏంటి? ఆ పూర్తి వివరాలు మీకోసం..

Horabeedu festival in Karnataka
మహమ్మారిని తరిమికొట్టేందుకు 'హోరాబేదు' ఉత్సవం!

By

Published : Feb 11, 2021, 5:16 PM IST

హోరాబేదు వేడుకను జరుపుకుంటున్న మందగత్త వాసులు

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడం వల్ల.. గతేడాది నుంచి అన్ని దేశాలూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గతంలోనూ ఇలాంటి వైరస్​లు ప్రబలిన కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ప్రజలు మాత్రం ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండేందుకు నాటి నుంచీ ఓ శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తారట. అదే.. వారు దశాబ్దాల నుంచి ఎంతో గొప్పగా చేసుకునే 'హోరాబేదు' ఉత్సవం. కన్నడలో హోరాబేదు అంటే 'బయటపడటం/రక్షించుకోవడం' అని అర్థం.

హోరాబేదు-శాస్త్రీయ కారణం..

శివమొగ్గ తాలుకాలోని మందగత్త గ్రామ వాసులు.. ప్రతి మూడేళ్లకు ఓసారి తమ పెంపుడు, వీధి జంతువులతో సహా ఆ రోజు వాళ్ల ఇళ్లను ఖాళీ చేస్తారు. ఆ రోజంతా ఊళ్లోకి ఎవరూ రాకుండా గ్రామ సరిహద్దుల్లో కంచెను వేస్తారట. తమ పశువులతో పాటు ఊరు వదిలిన ఆ ప్రజలు.. పొలాలకు వెళ్లి రోజంతా అక్కడే ఉంటారు.

గతంలో మలేరియా, ప్లేగు వంటి వ్యాధులు ప్రబలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా ఇదే తరహాలో ఇళ్లను ఖాళీ చేసి.. పొలంలో వెళ్లి స్థిరపడేవారట. అక్కడే మారెమ్మను పూజించడం ప్రారంభించారు. దశాబ్దాల క్రితం మొదలైన ఈ వేడుకను ఇప్పటికీ ఆచరిస్తున్నారు మందగత్త వాసులు. ఫలితంగా గ్రామంలో ఏ జంతువులూ లేని కారణంగా.. అంటువ్యాధులు తగ్గుతాయని వారి అభిప్రాయం.

అలా.. ఈ ఏడాది కూడా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అక్కడి ప్రజలు. ఉదయాన్నే ఊరిని ఖాళీ చేసి.. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మారెమ్మ విగ్రహానికి పూజలు చేశారు. అక్కడే భోజనాలు వండుకుని తినేసి.. ఆ తర్వాత ఇళ్లకు రావడంతో వేడుకను ముగించారు.

ఇదీ చదవండి:'మిరపకాయ్​ మిఠాయ్​' రుచి​ చూశారా?

ABOUT THE AUTHOR

...view details