స్కూళ్లు, కాలేజీల్లో క్లాస్రూం సరదాలే వేరు! ఒక్కోసారి టీచర్- స్టూడెంట్స్ మధ్య జరిగే ఫన్నీ సంభాషణలతో క్లాస్రూం మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే బయటకొచ్చేస్తోంది. తాజాగా.. ఓ టీచర్-స్టూడెంట్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది.
ఆన్లైన్ సీఏ క్లాసు జరుగుతుండగా.. 'క్వార్టర్లో ఎంత ఉంటుంది? హత్విక్.. ఒక్క క్వార్టర్లో ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు' అంటూ ఉపాధ్యాయుడు ప్రశ్న వేశారు. అందుకు ఈ విద్యార్థి ఇచ్చిన సమాధానం విని ఆ టీచర్ మైండ్ బ్లాంక్ అయ్యింది.
'30ఎంఎల్ సర్,' అని తొలుత విద్యార్థి బదులిచ్చాడు. టీచర్ అడిగిన క్వార్టర్ ప్రశ్నకు విద్యార్థి 'మందు సీసా'కు తగ్గట్టు జవాబు ఇవ్వడం వల్ల అది విన్న అందరు తెగ నవ్వుకున్నారు. వెంటనే టీచర్ అందుకుని '30ఎంఎల్ ఆఆ? అరే బాబు.. నేను అడిగేది ఆ క్వార్టర్ గురించి కాదు,' అని కోపంగా చెప్పారు. వెంటనే సరిచేసుకున్న ఆ విద్యార్థి 'ఫోర్ సర్.. ఫోర్' అని అనడం వీడియో చివర్లో వినిపించింది.