డ్రైవర్ విధుల్లో ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే అది ప్రమాదం కిందే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈశాన్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (ఎన్ఈకేఆర్టీసీ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఈ విధంగా తీర్పు ఇచ్చింది.
డ్రైవర్ విజయ్కుమార్ కుటుంబానికి రూ.21.95 లక్షలు పరిహారం అందించాలని 2017లో సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఈకేఆర్టీసీ సవాల్ చేసింది.
ప్రమాదమే..
జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్, జస్టిస్ పీఎన్ దేశాయ్తో కూడిన ధర్మాసనం డ్రైవర్ విజయ్ కుమార్ మృతి గురించి ప్రస్తావించింది.