తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'430 జిల్లాల్లో నెల రోజులుగా కరోనా కేసులు సున్నా' - కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్..​ ఆయన భార్యతో కలిసి కరోనా టీకా రెండో డోసును దిల్లీలోని గుండె, ఊపిరితిత్తుల ఇన్​స్టిట్యూట్​లో తీసుకున్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు. దేశంలోని మెజార్టీ జిల్లాల్లో కరోనా అదుపులో ఉందని స్పష్టం చేశారు.

Health Minister Vardhan
కేంద్ర మంత్రి హర్షవర్ధన్​

By

Published : Mar 30, 2021, 12:52 PM IST

దేశంలో 28 రోజులుగా 430 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా తీసుకున్నాక కూడా కరోనా సోకడంపై స్పందించారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా కరోనా సోకుతుందని అన్నారు.

దిల్లీలోని గుండె, ఊపిరితిత్తుల ఇన్​స్టిట్యూట్​లో కొవాగ్జిన్​ కరోనా టీకా రెండో డోసును ఆయన భార్య నూతన్ గోయల్​తో కలిసి​ తీసుకున్నారు హర్షవర్ధన్. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు.

60 ఏళ్లు, అంతకంటే వయస్సు పైబడిన వారు, 45 ఏళ్ల వయస్సుండి ఇతర వ్యాధులతో బాధపడేవారి కోసం కేంద్రం కరోనా టీకాను ఇటీవల పంపిణీ చేస్తోంది. వారంతా టీకా తీసుకోవాలని హర్షవర్ధన్​ కోరారు. భారత టీకా సామార్థ్యాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారి మాటలు నమ్మవద్దని అన్నారు.

టీకా తొలి డోసును హర్షవర్ధన్​ మార్చి 2న తీసుకున్నారు.

ఇదీ చదవండి:సొంత ప్రజల కన్నా వారికే ఎక్కువ టీకాలు: భారత్

ABOUT THE AUTHOR

...view details