తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తృణమూల్​ ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్​ - trinamool congress party allegations

ఎన్నికల అధికారి సుదీప్​ జైన్​పై తృణమూల్​ కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. తమకు జైన్​పై నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులపై ఆరోపణలు మోపడం ఇది తొలిసారి కాదని వ్యాఖ్యానించింది.

election commission
తృణమూల్​ ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్​

By

Published : Mar 5, 2021, 8:09 PM IST

బంగాల్​ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఇన్​ఛార్జ్​ సుదీప్​ జైన్​ పక్షపాతి అని తృణమూల్​ కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్​ ఖండించింది. జైన్​పై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు అందరూ రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పలు సందర్భాల్లో పొరపాట్లు తలెత్తుతాయని, అయితే వాటిపై వెంటనే చర్యలు చేపడతున్నామని ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల అధికారులపై ఇలా నింద మోపడం తొలిసారి కాదని తెలిపింది. ఏ నిర్ణయమైనా డిప్యూటీ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, నోడల్​ పోలీస్​ అధికారి సహా సీనియర్ అధికారులతో చర్చించి తీసుకుంటామని ఉద్ఘాటించింది. ఇది వరకు తృణమూల్​ కాంగ్రెస్..​ జైన్​పై చేసిన ఆరోపణలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో జైన్​ తీసుకున్న పలు నిర్ణయాలను తృణమూల్ తప్పుపట్టింది.

సుదీప్​ జైన్​ను బాధ్యతల నుంచి తొలగించాలంటూ తృణమూల్​ సీనియర్​ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల కమిషన్​కు గురువారం లేఖ రాశారు. జైన్​ పక్షపాతంగా వ్యవహరిస్తారని.. అందుకు 2019 ఎన్నికలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ​

ఇదీ చదవండి :ఆటో డ్రైవర్​కు రూ.56 వేల కరెంటు బిల్లు

ABOUT THE AUTHOR

...view details