తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి - కరోనాతో నర్సు మృతి

ఆమె నర్సు. ఇటీవలే పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 23న పెళ్లి. ఇంతలో ఆమెకు కరోనా సోకింది. మరో రెండు రోజుల్లో జరుగుతుందనగా ఆమె కరోనాతో మృతి చెందింది. ఈ తీవ్ర విషాద ఘటన గుజరాత్​లో జరిగింది.

nurse
మనీషా బెన్

By

Published : Apr 23, 2021, 11:47 AM IST

Updated : Apr 23, 2021, 1:59 PM IST

పెళ్లికి రెండురోజులు ఉందనగా ఓ నర్సు కరోనాతో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గుజరాత్​లోని వల్సాద్​ జిల్లాలో జరిగింది.

మనీషా బెన్
పెళ్లి కార్డు

కప్రదా తాలుగా మోటపొంధా గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ కూతురి పేరు మనీషా బెన్. దగ్గరలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు పెళ్లి కుదరగా.. కొద్దిరోజుల నుంచి ఇంటివద్దే ఉంటోంది. ఏప్రిల్ 23నే వివాహం. పెళ్లి కార్డులు కూడా పంచారు. అయితే ఇంతలో కరోనా సోకి సిల్వాసా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అత్యవసరంగా ఓ ఇంజెక్షన్ అవసరమైంది. తీసుకొచ్చేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు సూరత్ వెళ్లగా.. ఇంజక్షన్ తెచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది.

ఇదీ చదవండి:దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా

Last Updated : Apr 23, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details