పెళ్లికి రెండురోజులు ఉందనగా ఓ నర్సు కరోనాతో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో జరిగింది.
రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి - కరోనాతో నర్సు మృతి
ఆమె నర్సు. ఇటీవలే పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 23న పెళ్లి. ఇంతలో ఆమెకు కరోనా సోకింది. మరో రెండు రోజుల్లో జరుగుతుందనగా ఆమె కరోనాతో మృతి చెందింది. ఈ తీవ్ర విషాద ఘటన గుజరాత్లో జరిగింది.
![రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి nurse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11506547-thumbnail-3x2-img.jpg)
కప్రదా తాలుగా మోటపొంధా గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ కూతురి పేరు మనీషా బెన్. దగ్గరలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు పెళ్లి కుదరగా.. కొద్దిరోజుల నుంచి ఇంటివద్దే ఉంటోంది. ఏప్రిల్ 23నే వివాహం. పెళ్లి కార్డులు కూడా పంచారు. అయితే ఇంతలో కరోనా సోకి సిల్వాసా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అత్యవసరంగా ఓ ఇంజెక్షన్ అవసరమైంది. తీసుకొచ్చేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు సూరత్ వెళ్లగా.. ఇంజక్షన్ తెచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది.
ఇదీ చదవండి:దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా