తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సామూహిక వివాహంలో ఒక్కటైన 300 జంటలు

gujarat mass marriage: గుజరాత్​​లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ చొరవతో నవ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

By

Published : Dec 5, 2021, 4:50 PM IST

Updated : Dec 5, 2021, 5:06 PM IST

Mass wedding ceremony
సామూహిక వివాహాలు

mass marriage surat: సాధారణంగా వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి 300 మంది యువతులకు సామూహిక వివాహ వేడుక నిర్వహించి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ. పెళ్లి ఖర్చు తగ్గించడం సహా తల్లిదండ్రులు లేని యువతులకు అన్నీతామై వివాహాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నారు ఆయన. సంస్థ 2008లో తొలిసారిగా ప్రారంభించిన ఈ సామూహిక వివాహ వేడుక నేటికీ కొనసాగుతుండటం విశేషం.

సందడిగా సామూహిక వివాహ వేడుక
కొత్తజంట

pp savani group surat: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. దీనితో వీరి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే కరోనా మూడో దశ భయాలు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభణ కారణంగా ఈ వివాహా వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు.

ముస్లిం వధువు వివాహం
పెళ్లి వేదిక వద్దకు వస్తున్న మహేశ్ సవానీ

mahesh savani: ఈ సందర్భంగా 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్ సవానీ అన్నారు.

అతిథులను అప్యాయంగా పలకరిస్తున్న మహేశ్ సవానీ
ముస్లిం వరుడి వివాహ వేడుక

"సాధారణంగా ఈ వివాహాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారే ఎక్కువగా ఉంటారు. వీరితో పాటు 100 మంది పేద యువతులకూ పెళ్లి జరిపిస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం కన్యాదానం చేసి వివాహాలు జరిపిస్తాం. ఇందులో పలు కులాలు, మతాలకు చెందిన యువతులు ఉన్నారు."

---మహేశ్‌ సవానీ, చైర్మన్‌, సవానీ గ్రూప్

ఈ వేడుకకు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్​లు హాజరయ్యారు.

మహేశ్ సవానీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 5, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details