అండర్గ్రౌండ్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు (Crime news Telugu) మరణించారు. గుజరాత్ గాంధీనగర్లోని (Gujarat Gandhinagar news) ఓ ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది.
శనివారం కంపెనీకి సెలవు కావడం వల్ల.. ద్రవ వ్యర్థాలను నిల్వ చేసే ట్యాంకును (Crime news Telugu) శుభ్రం చేయించేందుకు కూలీలను పిలిచారు ఫార్మా సంస్థ యజమాని. ట్యాంకులో ద్రవ వ్యర్థాలు పెద్దగా లేనందున ఓ కూలి.. లోపలికి దిగి శుభ్రం చేసేందుకు యత్నించాడు. అంతలోనే విషవాయువులు పీల్చి కుప్పకూలాడు. అతన్ని కాపాడేందుకు మిగిలిన నలుగురు ట్యాంకులోకి దిగి.. అదే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.