మహారాష్ట్ర పుణెలో కరోనా విలయం కొనసాగుతోంది. అంబులెన్సులు, ఆస్పత్రుల్లో పడకలు దొరని పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో పుణెలోని కొంత మంది ఆటోడ్రైవర్లు.. కొవిడ్ బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. 'జుగాడ్ అంబులెన్సు' పేరుతో ఆటోలను అంబులెన్సుగా మార్చి సేవలు అందించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
తమ వద్ద ఉన్న మూడు ఆటోల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేసినట్లు.. 'జుగాడ్ అంబులెన్సు' రూపకర్త కేశవ్ క్షీర్సాగర్ తెలిపారు.
"ఈ ఆటోల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు 6-7 గంటలపాటు పని చేస్తాయి. కరోనా బాధితుల కోసం మేం ఓ హెల్ప్లైన్ నంబర్ను కూడా తీసుకువచ్చాం. రోగులకు ఆక్సిజన్ను ఎలా అందించాలో మా ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చాం. కరోనా బారిన పడకుండా ఆటోడ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మాకు ఓ వైద్యుల బృందం కూడా ఉంది."