ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడం కోసం రైతుల దగ్గర నుంచి ఆదాయాన్ని, వారి భవిష్యత్తును కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అందుకోసమే నూతన వ్యవసాయ చట్టాల్ని తెచ్చిందని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో రైతులకు నగదు బదిలీ పథకం(రాజీవ్గాంధీ కిసాన్ న్యాయ్ యోజన) ఫలాలను అందజేసే కార్యక్రమంలో ఈమేరకు వీడియో సందేశం ఇచ్చారు రాహుల్.
"కేంద్రం రైతులు ప్రయోజనాల్ని దెబ్బతీయాలని చూస్తోంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల, శ్రామికల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. గ్రామాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది."