తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలకు 2 నెలలు ఉచితంగా రేషన్! - ఉచితంగా ఆహార దినుసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గతేడాది మాదిరిగానే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది కేంద్రం. పీఎండీకేఓవైలో భాగంగా మే, జూన్​ నెలల్లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది.

free food grains
పేదలకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ!

By

Published : Apr 23, 2021, 4:14 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ.. దేశంలోని పేదలకు ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన (పీఎండీకేఓవై) కింద మే, జూన్​ నెలల్లో ఉచితంగా ఆహార దినుసులు అందించాలని నిర్ణయించింది కేంద్రం. ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది. పీఎండీకేఓవైలో భాగంగా రెండు నెలల పాటు మొత్తం 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కరోనాతో దేశ ప్రజలు పోరాడుతున్న వేళ వారికి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. ఈ పథకం కోసం రెండు నెలలకు కేంద్రం రూ. 26 వేల కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'మే 15కు కరోనా ఉగ్రరూపం.. ఆ తర్వాత...'

ABOUT THE AUTHOR

...view details