సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్షక నేతలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.
"అన్నదాతలతో ప్రభుత్వం మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతోంది. ఇప్పటికీ... రైతు నేతలు స్పందిస్తే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
-తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.