కరోనా వ్యాక్సిన్ను డ్రోన్లతో సరఫరా చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డ్రోన్ల వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఐసీఎంఆర్ అధ్యయనం చేయడానికి పౌర విమానయాన శాఖ గురువారం అనుమతి ఇచ్చింది.
ఐఐటీ కాన్పూర్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేయనున్నాయి. ఇందుకు షరతులతో కూడిన అనుమతులు లభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అనుమతులు ఏడాది పాటు అమలులో ఉండనున్నట్లు పేర్కొంది.