తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2021, 12:16 PM IST

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు-రాకపోకలకు అంతరాయం

గూడ్స్​ రైలు పట్టాలు తప్పి(goods train derailment today) ఎనిమిది బోగీలు చెల్లాచెదురయ్యాయి. యూపీలోని అలహాబాద్​ నుంచి డీడీయూ జంక్షన్​కు వస్తున్న క్రమంలో చందౌలీ జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఇతర సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

train derail
పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

ఉత్తర్​ప్రదేశ్​ చందౌలీ జిల్లాలో గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది(goods train derail in uttar pradesh). అలహాబాద్​ నుంచి పీటీ డీడీయూ జంక్షన్​కు వస్తున్న క్రమంలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి(goods train derailment today).

ప్రమాదానికి గురైన గూడ్స్​ ట్రైన్​

పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుడ్స్​ రైలు పట్టాలు తప్పిన(goods train derailed) క్రమంలో ఈ మార్గంలో ఇతర సర్వీసులకు అంతరాయం ఏర్పడిందన్నారు. దిల్లీ-హౌరా, ప్రయాగ్​రాజ్​- డీడీయూ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లు చెప్పారు. సుమారు 12 రైళ్లు నిలిచిపోయాని తెలిపారు.

పట్టాలు తప్పిన బోగీలు

ఇతర రైళ్లను దారి మళ్లించటం లేదా.. వ్యాస్​ నగర్​ మీదుగా డీడీయూకు తరలించే అవకాశం ఉందని ఈస్ట్​కోస్ట్​ రైల్వే సీపీఆర్​ఓ రాజేశ్​ కుమార్​ తెలిపారు.

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు
పక్కకు పడిపోయిన బోగీలు

ఇదీ చూడండి:పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు- ప్రయాణికులు సేఫ్​

ABOUT THE AUTHOR

...view details