తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2021, 3:24 PM IST

ETV Bharat / bharat

కేంద్రం X కేరళ: ఈడీపై పోలీసుల కేసు!

బంగారం స్మగ్లింగ్ కేసులో ఈడీ అధికారులపై కేసు నమోదు చేసింది కేరళ క్రైం బ్రాంచ్. నిందితురాలు స్వప్నా సురేశ్​పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించారన్న ఆరోపణలపై ఈమేరకు చర్యలు చేపట్టింది.

Gold smuggling case: Crime Branch registers case against ED officials
బంగారం స్మగ్లింగ్ కేసులో ఈడీపై కేసు నమోదు

బంగారం స్మగ్లింగ్ కేసులో ఏకంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్​ అధికారులపైనే కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్​ పోలీసులు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలు స్వప్నా సురేశ్​పై ఒత్తిడి చేసి, సీఎం పినరయి విజయన్​కు వ్యతిరేకంగా గతేడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ఈడీ అధికారులు వాంగ్మూలం ఇప్పించి, తప్పుడు సాక్ష్యాల సృష్టికి యత్నించారన్నది పోలీసుల ప్రధాన ఆరోపణ. లీక్​ అయిన స్వప్న ఆడియోటేప్​ అధారంగా ఈ ఫిర్యాదు నమోదు చేశారు.

కేరళ క్రైం బ్రాంచ్​ కేసు నమోదు చేయడం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి.

దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం, భాజపా వాడుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:కేరళ రాజకీయాల్లో 'గోల్డ్​' చిచ్చు.. ఎవరికి లాభం?

ABOUT THE AUTHOR

...view details