తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2021, 2:28 PM IST

ETV Bharat / bharat

కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానం: రాహుల్

18-45 మధ్య వయస్కుల వారికి ఉచిత టీకా ఇవ్వాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియలోను వివక్ష చూపుతున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు. మరో సీనియర్ కాంగ్రెస్​ నేత కపిల్ సిబల్.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలిచేందుకు చూపిన ఆసక్తి కరోనా కట్టడిపై చూపించి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

కొవిడ్​ కట్టడి, టీకా పంపిణీ విషయంలో మోదీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18-45 మధ్య వయస్కుల వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వకపోవడానికి కారణమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మధ్యవర్తుల కారణంగా వాక్సిన్​ ధరలకు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదలకు వ్యాక్సిన్​ ఇవ్వడంపై స్పష్టత ఏదని అన్నారు. కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానమని ట్వీట్​ చేశారు రాహుల్.

ఎన్నికలపైనే మక్కువా?

ఎన్నికల్లో గెలిచేందుకు చూపిన ఆసక్తి.. కరోనాను కట్టడి చేయడంలో ఎందుకు చూపలేదని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దేశంలో కొవిడ్​ పరిస్థితులు ఉద్ధృతంగా మారుతుంటే మోదీ బాధ్యతారాహిత్యంగా బంగాల్​ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి:'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'

ABOUT THE AUTHOR

...view details