కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఏప్రిల్ 29 రాత్రి 7 గంటల నుంచి మే 3 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిత్యావసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
గురువారం నుంచి గోవాలో లాక్డౌన్ - గోవా లాక్డౌన్
కరోనా కట్టడికి గోవా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు.

గోవా లాక్డౌన్
ప్రజా రవాణా, కాసినోలు, హోటళ్లు, పబ్బులు పూర్తిగా మూసివేస్తున్నట్లు సావంత్ తెలిపారు. నిత్యవసర సేవల రవాణాకు మాత్రమే సరిహద్దులు తెరిచి ఉంటాయని చెప్పారు.