కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసంగాల వల్ల ఎలాంటి లాభం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు సంధించిన ఆయన.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
"నేను హోం క్వారంటైన్లో ఉన్నాను. దేశం నలుమూలల నుంచి బాధాకరమైన వార్తలు నిరంతరం వినాల్సి వస్తోంది. ఈ సంకట పరిస్థితులకు కారణం కరోనా ఒక్కటే కాదు.. కేంద్ర సర్కారు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా. పనికిరాని ఉత్సవాలు (మోదీ పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్ను ఉద్దేశించి), పస లేని ప్రసంగాలు కాదు.. సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడింది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత